KMM: ఖమ్మంలోని 50, 27వ డివిజన్లలో శుక్రవారం కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య పర్యటించారు. డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులను పరిశీలించి, వర్షాకాలంలో నీరు నిల్వకుండా, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడకూడదని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా సీసీ రోడ్డు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు.