ASF: కాగజ్ నగర్ మండలం వేంపల్లి టింబర్ డిపోలో ఈనెల 24న ఉదయం 11 గంటలకు కలప వేలం నిర్వహించనున్నట్లు జిల్లా అటవీ అధికారి నీరజ్ కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫారెస్ట్ డివిజనల్ అధికారి A. అప్పయ్య పర్యవేక్షణలో జరిగే ఈ కార్యక్రమంలో, నిబంధనల ప్రకారం పారదర్శకంగా కలపను విక్రయిస్తారన్నారు. అర్హత కలిగిన వ్యాపారులు, వినియోగదారులు పాల్గొని షరతులు పాటించాలని పేర్కొన్నారు.