JN: జిల్లా కేంద్రంలోని పూసల భవనంలో గొర్రెల మేకల పెంపకందారుల సంఘం (GMPS) జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన జిల్లా గౌరవ అధ్యక్షుడిగా సాదం రమేష్, అధ్యక్షుడిగా దేవేందర్, జిల్లా ఉపాధ్యక్షులుగా జీగారి యాదగిరి, గుండా వెంకటయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాలరాజు, జిల్లా సహాయ కార్యదర్శిలుగా ఆవుల ప్రభాకర్, స్వరూపను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.