MNCL: వేసవి దృష్ట్యా విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు మంచిర్యాల జిల్లా విద్యుత్ శాఖ అధికారి రాజన్న మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది విద్యుత్ వినియోగం పెరిగిందని, అందుకు తగ్గట్లుగానే ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా పలు ఉపకేంద్రాల్లో పవర్ ట్రాన్స్ ఫార్మర్లు అందుబాటులోకి తెచ్చామన్నారు.