మహబూబాబాద్: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 156 దరఖాస్తులను కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ స్వీకరించారు. ప్రజల నుంచి తీసుకున్న ఫిర్యాదులను ఆయా శాఖల అధికారులకు కలెక్టర్ కేటాయించి వెంటనే వీటి పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. ఈ ఫిర్యాదుల్లో అత్యధిక శాతం పింఛన్ సదరన్ క్యాంపుకు సంబంధించినవే ఉన్నాయి.