PDPL: గోదావరిఖని సింగరేణి స్టేడియం సమీపంలో సంస్థ ఏర్పాటు చేసిన RO వాటర్ ప్లాంట్ నిర్వహణ సరిగా లేకపోవడంతో పరిసర ప్రాంతాలకు చెందిన కార్మిక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవి ప్రారంభంలోనే మంచినీటి కోసం అవస్థలు పడుతున్నారు. ఈ పంపు ఎప్పుడు వస్తుందో తెలియదు. క్యాన్లు, బిందెలు పట్టుకొని రావడం, తిరిగి వెళ్లడం జరుగుతుంది. బాగు చేయాలని కోరుతున్నారు.