PDPL: గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో కనీస వైద్య సదుపాయాలు కల్పించాలని CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. కార్మిక నేతలతో కలిసి శనివారం ఆస్పత్రికి వెళ్లి వైద్యాధికారి అంబికకు వినతి పత్రం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కష్టించే కార్మికులకు సరైన వైద్య సౌకర్యాలు కల్పించాలని కోరారు.