VKB: రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా పోలీస్ శాఖ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఘనంగా ప్రారంభించారు. నిన్న పట్టణంలోని సత్యభారతి హాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంటి వైద్య శిబిరం, రోడ్డు భద్రతా అవగాహన సదస్సుకు హాజరై మాట్లాడారు. డ్రైవర్ల కంటి చూపు బాగున్నప్పుడే సురక్షిత ప్రయాణం ఉంటుందన్నారు.