WGL: నల్లబెల్లి(M) కేంద్రంలోని రామతీర్థం GP చెందిన మేరుగు నవ్య సతీష్ నూతన నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లు గృహప్రవేశ కార్యక్రమాన్ని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.