NZB: మున్సిపల్ కార్మికుల సీఐజీ గ్రూపులను యథావిధిగా కొనసాగించాలని TUCI, CITU, AITUC కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఏజెన్సీ కార్మికులతో కొత్త గ్రూపులు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎం. సుధాకర్, ఓమయ్య, ఏ.రమేష్ బాబు పాల్గొన్నారు.