NGKL: శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించేందుకు మంగళవారం రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా ఎమ్మెల్యేలు రానున్నట్లు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. వేసవి దృష్ట్యా సాగునీటి ఎద్దడి కలగకుండా విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని అధికారులతో చర్చించనున్నారు. అనంతరం ప్రాజెక్టు పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.