KMR: కలెక్టరేట్లో నేడు నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రజల నుంచి 117 దరఖాస్తులను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను పెండింగ్లో పెట్టకుండా తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పరిష్కారం కాని దరఖాస్తులపై బాధితులకు స్పష్టమైన వివరణ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్ ఉన్నారు.