SRCL: జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో పట్టపగలే దొంగతనం జరిగింది. బాధితుడు వడ్లూరి రాజం వివరాల ప్రకారం.. గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి రూ. 2 లక్షల నగదు, బంగారు పుస్తెలు, 6 తులాల బ్రాస్లెట్లు, వెండి గొలుసులు అపహరించారని పేర్కొన్నారు. బాధితుని ఫిర్యాదు మేరకు ఎస్సై ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.