WNP: రాజాపూర్ సబ్ స్టేషన్ పరిధిలోని కదిరేపాడులో నూతన విద్యుత్ ఫీడర్ను సర్పంచ్ గ్రామ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఇంతకుముందు పలు తండాలు, గ్రామాలకు ఒకే ఫీడర్ ఉండటంతో లో-వోల్టేజ్ సమస్యలు తలెత్తేవని తెలిపారు. కొత్త ఫీడర్తో రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించి సాగులో ఇబ్బందులు తగ్గుతాయని సర్పంచ్ పేర్కొన్నారు. గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.