JGL: గోదావరి మహా పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో సమీక్ష సమావేశంలో అధికారులను ఆదేశించారు. 2027 సంవత్సరంలో జూన్ 26-జూలై 7వరకు జరిగే పుష్కరాల దృష్ట్యా ఘాట్ నిర్మాణం, రోడ్లు, లైటింగ్, పారిశుద్ధ్యం, భద్రతా ఏర్పాట్లు, ఆలయాల అభివృద్ధిపై ప్రతిపాదనలు సమర్పించాలన్నారు.