JGL: పెగడపల్లి మండలంలో నేటి నుంచి జూన్ 12వ తేదీ వరకు 99 రోజుల పాటు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో ప్రేమ్ సాగర్ ఒక ప్రకటనలో తెలిపారు. పరిసరాల పరిశుభ్రత, ప్రజారోగ్యం, సంక్షేమం, విద్య, మహిళా సంక్షేమ వంటి అంశాలపై మండలంలో అన్ని గ్రామాల్లో కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు.