KNR: చొప్పదండి సింగిల్ విండో ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఎమ్మెల్యే సత్యం ప్రారంభించారు. రైతులు తమ పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మి మద్దతు ధర పొందాలని ఆయన అన్నారు. చొప్పదండి సహకార సంఘం ఆధ్వర్యంలో మార్కుఫెడ్ ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీ క్వింటాకు రూ. 8000 చొప్పున కందులు కొనుగోలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.