ADB: ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేశ్ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు నిన్న పట్టణంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలు, పలు అంశాలపై ఎంపీతో చర్చించగా సానుకూలంగా స్పందించినట్లు సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో TGO జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానందరెడ్డి, జిల్లా కార్యదర్శి రమణాచారి, తదితరులు ఉన్నారు.