KRNL: ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామంలోని సర్వే నంబర్ 1300/1లోని 43 ఎకరాల భూమికి హద్దులు ఏర్పాటు చేయాలని జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ మురళీకృష్ణకు జాతీయ మాల మహానాడు సంఘం వినతి పత్రం సమర్పించారు. 25 ఏళ్లుగా సాగు చేస్తున్న రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ నెల 30లోపు సర్వే పూర్తి చేసి హద్దులు ఏర్పాటు చేస్తామన్నారు.