TPT: సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం MAO కార్యాలయంలో ప్రకృతి వ్యవసాయంపై రెండు రోజుల శిక్షణ ప్రారంభమైంది. నవ సార్వత్రిక సూత్రాల ప్రాముఖ్యతను వివరిస్తూ, తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడంపై అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. రసాయనాల వినియోగం తగ్గించి, భూసారాన్ని ఎలా కాపాడుకోవాలో వివరించారు. సాగులో ప్రకృతి పద్ధతులు పాటిస్తూ ఆర్థికాభివృద్ధి సాధించాలని కోరారు.