TPT: వరదయ్యపాలెం(M) రాచర్లలో బుధవారం ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్, ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పర్యటించనున్నారు. ఉదయం 10:30 గంటలకు మంత్రి, ఎమ్మెల్యే వరదయ్య పాలెం మండలం రాచర్లకు చేరుకొని రూ.125.30 కోట్లతో నూతనంగా నిర్మించిన 220/132/33 KV విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం చేస్తారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనాలని ఎమ్మెల్యే కోరారు.