SDPT: హైదరాబాద్ దోమలగూడలో జరిగిన రాష్ట్ర స్థాయి దివ్యంగుల క్రీడా పోటీల్లో జిల్లా విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. 33 జిల్లాల నుంచి సుమారు 1200 మంది పాల్గొన్న ఈ పోటీల్లో సిద్దిపేట క్రీడాకారులు ఏకంగా 11 బహుమతులు గెలుచుకున్నారు. అండర్-14, 17 విభాగాల్లో వినికిడి, దృష్టి లోపం, ఇతర దివ్యాంగ విద్యార్థులు తమ క్రీడా నైపుణ్యంతో జిల్లా కీర్తిని చాటారు.