NRPT: జిల్లాలో భూగర్భ జలాలు తగ్గిపోవడంతో వరి సాగు చేస్తున్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎకరాకు సుమారు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టినప్పటికీ, కోత దశకు చేరుకున్న సమయంలో బోర్లలో నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. భూమి నెర్రలు వచ్చి చీలిపోయే పరిస్థితి రావడంతో రైతులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. దిక్కుతోచని స్థితిలో తమ పంటలను పశువుల మేతకు వదిలేస్తున్నారు.