MHBD: నర్సింహులపేట మండలంలోని కొమ్ములవంచ గ్రామ పరిధిలోని పంట పొలాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ రెండు రోజుల క్రితం కాలిపోగా, బురదలో కాళ్లు దిగబడుతున్నా, చెమటలు కారుతున్నా పంటలను కాపాడాలనే తపనతో రైతులు కర్రల సాయంతో భుజాలపై ట్రాన్స్ఫార్మర్ మోసుకెళ్లారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికార యంత్రంగంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.