NGKL: కుమ్మెర జాతరలో రజక కుటుంబంపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు శుక్రవారం కలెక్టరేట్లో వినతిపత్రం ఇచ్చారు. ఘటన జరిగి ఐదు రోజులు గడుస్తున్నా బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని నాయకులు నరసింహ, స్వరూప మండిపడ్డారు. బాధితులకు వెంటనే న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.