SDPT: జిల్లాలో సోమవారం సాయంత్రం కురిసిన అకాల వర్షం పంటలను దెబ్బతీసింది. ముఖ్యంగా మిరుదొడ్డి, దుబ్బాక మండలంలోని పలు గ్రామాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. కొండాపూర్, అందె తదితర గ్రామాల్లో మొక్కజొన్న పొద్దుతిరుగుడు పంటలు నేలవాలాయి. కూరగాయల తోటలు ధ్వంసమయ్యాయి. పలుచోట్ల రోడ్లపై అడ్డంగా చెట్లు పడడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి.