కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో సోమవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటించారు. ఈ మేరకు బాన్సువాడలో జరిగిన సంఘటన బాధితుల కుటుంబాన్ని పరామర్శించి, వివరాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు బీజేపీ అధ్యక్షులు చిన రాజులు, బీజేపీ రాష్ట్ర నేత డా. పైడి ఎల్లారెడ్డి పాల్గొన్నారు.