NLG: చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ నేరడలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఛైర్ పర్సన్ నర్రా వినోద, వెటర్నరీ వైద్యులు వనం అభినవ్, అమరేందర్ పాల్గొన్నారు. ఈ శిబిరంలో 161 పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసి, 36 పశువులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. మార్కెట్ కార్యదర్శి జానయ్య, సర్పంచ్ మిర్యాల వెంకటేశం పాల్గొన్నారు.