WGL: గీసుగొండ మండలం కొమ్మల గ్రామంలో మరో రెండు రోజుల్లో శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ప్రారంభం కానుంది. అయితే ప్రతి ఏడాది ప్రతి ఏడాది జాతర సమయంలో స్థానికంగా రాజకీయ అంతర్గత విభేదాలు, వర్గ పోరాటాలు చర్చనీయాంశమవుతుండగా ఈసారి కూడా అలాంటి పరిస్థితులు తలెత్తుతాయా అన్న ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.