NLG: ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, డిప్లొమా, ITI వాళ్లకు నెలకు రూ.2 వేల స్కాలర్షిప్ ప్రకటించడం విద్యార్థుల భవిష్యత్తుకు దోహదపడుతుందని NSUI జిల్లా కార్యదర్శి ప్రసాద్ గౌడ్ అన్నారు. రాష్ట్ర బడ్జెట్లో విద్య, ఉస్మానియా వర్సిటీ అభివృద్ధి, రాజీవ్ యువ వికాసం పథకానికి అధిక నిధులు కేటాయించడం అభినందనీయమని, ఇది యువతకు ఉపాధి అవకాశాలను పెంచుతుందని తెలిపారు.