RR: ఫరూఖ్నగర్ మండలం దూసకల్ గ్రామంలో విషాదం నెలకొంది. ఇంటర్ ఫలితాల్లో రెండు సబ్జెక్టులు తప్పాననే మనస్తాపంతో అభి యాదవ్ అనే విద్యార్థి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణంలోని ప్రైవేట్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఇతడు, ఎవరూ లేని సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే, ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా తల్లిదండ్రులు గోప్యంగా ఉంచారు.