ATP: కనేకల్లు మండలం మాల్యం గ్రామంలో మహర్షి వాల్మీకి విగ్రహాన్ని MLA కాలవ శ్రీనివాసులు ఆవిష్కరించారు. రామాయణం ద్వారా సమాజానికి ధర్మ మార్గాన్ని చూపిన వాల్మీకి ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. భారతీయ సంస్కృతి, సాహిత్యానికి ఆయన చేసిన సేవలు అపారమని కొనియాడారు. మహనీయుల అడుగుజాడల్లో నడుస్తూ సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.