ASF: పెంచికల్ పేట్ మండలం కొండపల్లిలో హత్యకు గురైన సమ్మక్క కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం, భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. న్యాయం చేయకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామన్నారు.