RR: గిరిజనుల ఆరాధ్యదైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన, పరివార దేవతల విగ్రహ ప్రతిష్టాపన, భోగ్ బండారో ప్రత్యేక పూజ కార్యక్రమాన్ని రేపు షాద్నగర్ పట్టణంలో నిర్వహించనున్నట్లు గిరిజన సంఘాల నేతలు తెలిపారు. టీచర్స్ కాలనీలోని దుర్గామాత దేవాలయం నుంచి ముఖ్య కూడలి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని, ప్రతి తండా నుంచి నాయకులు పాల్గొనాలన్నారు.