MNCL: చెన్నూర్ గురుకుల పాఠశాల హాస్టల్లో 7వ తరగతి విద్యార్థిని శ్రీహిందు ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. 3 రోజుల క్రితం స్నేహితులతో జరిగిన గొడవతో మనస్తాపం చెంది బాలిక పురుగు మందు తాగింది. వెంటనే మంచిర్యాల ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.