MDK: ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని పెద్ద శంకరంపేట, అల్లాదుర్గం SIలు ప్రవీణ్ రెడ్డి, శంకర్ అన్నారు. ఇవాళ పెద్ద శంకరంపేట పోలీస్ స్టేషన్లో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని గౌరవించాలని వాటికి అనుగుణంగా మెలగాలన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు బాధ్యతలను కాపాడుకోవాలన్నారు.