కోనసీమ: అమలాపురంలో పెళ్లిళ్ల వెంకన్నగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి స్వామివారి తెప్పోత్సవం వైభవంగా జరిగింది. విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన పుష్కరిణిలో స్వామివారిని శేష వాహనంపై అధిష్టింపజేసి విహరింపజేశారు. ఈ వేడుకను తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు.