BHPL: చిట్యాల మండలంలోని పలు గ్రామాలలో సాయంత్రం సంపూర్ణ చంద్రగ్రహణం కనువిందు చేసింది. ఆకాశంలో చంద్రుడు ఎరుపు రంగులోకి మారిన అరుదైన ‘బ్లడ్ మూన్’ దృశ్యాన్ని ప్రజలు ఆసక్తిగా వీక్షించారు. గ్రహణం కారణంగా చిట్యాలలోని ప్రధాన ఆలయాలను ఉదయమే మూసివేసి, శుద్ధి అనంతరం పునఃప్రారంభించనున్నారు. ఖగోళ ప్రేమికులు ఈ అద్భుత దృశ్యాన్ని చూసి పులకించిపోయారు.