BDK: దమ్మపేట మండలంలో పలు గ్రామపంచాయతీలలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఇవాళ పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నాచారం మారప్పగూడెం జగ్గారం పూసుకుంట గ్రామపంచాయతీల పరిధిలోని గ్రామాలలో రూ. 45.50 లక్షల వ్యయంతో నిర్మించబోయే సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.