NZB: పోతంగల్ మండలం కల్లూరులో ఆదివారం ఓ పిచ్చి కుక్క కరిచి నలుగురిని గాయపరిచింది. కల్లూరులో ఓ పిచ్చి కుక్క దాడిలో తీవ్రంగా గాయపడిన మంగ, సాయవ్వ, విగ్నేశ్వర్, గంగాధర్ను స్థానికులు పోతంగల్ 108 అంబులెన్స్లో బోధన్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. సకాలంలో స్పందించి ప్రథమ చికిత్స చేసిన పోతంగల్ ఈఎంటి నవీన్, పైలెట్ కలీంలను వైద్యులు, గ్రామస్థులు అభినందించారు.