KMM: తిరుమలాయపాలెం మండలం బీరోలుకి చెందిన బీటెక్ విద్యార్ధిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తోటి విద్యార్థులు తెలిపారు. గ్రామానికి చెందిన బూరుగు మైన కోదాడలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతుంది. శుక్రవారం సాయంత్రం కాలేజి భవనం నుంచి దూకడంతో రెండు కాళ్లు విరిగాయి. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉందని తెలిపారు.