ATP: గుత్తి మండల ఏపీటీఎఫ్ నూతన కార్యావర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు పోతులయ్య పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. మండల అధ్యక్షులుగా చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శిగా వీరాంజనేయులు ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు. ఉపాధ్యాయులు సమస్యలపై పోరాటం చేయడంతోపాటుగా, ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకునే దిశగా కృషి చేయాలన్నారు.