GNTR: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని సీఆర్డీఏ కమిషనర్ విజయరామరాజు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో అమరావతి రాజధాని పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల పురోగతి తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.