NTR: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నైజాం గేట్ సెంటర్లో అమరావతి సంబరాలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాద్ మాట్లాడుతూ.. అమరావతి అభివృద్ధిని అడ్డుకోవడం పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి తరం కాదని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతి అంటే ప్రజలంతా సంతోషంగా ఉన్నారని తెలిపారు కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.