CTR: నగిరిలో పేదలకు ఇంటి స్థలాల కోసం సీపీఐ పార్టీ ధర్నా నిర్వహించింది. నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య అర్హులందరికీ స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులకు స్వీపర్స్ కాలనీ ఏర్పాటు చేయాలని కోరారు. ఇల్లు నిర్మించుకుని నివసిస్తున్న వారికి పట్టాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆర్డీవో సమస్యలు పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.