సత్యసాయి: చెన్నేకొత్తపల్లి మండలం కనుముక్కల గ్రామ సమీపంలోని పెద్ద చెరువులో సోమవారం ఏర్పాటు చేసిన ‘జలధార – నీటి భద్రత’ కార్యక్రమంలో ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె స్వయంగా జేసీబీ నడిపి పనులను ప్రారంభించడం విశేషం. నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణలో సాగునీటి సంఘాల బాధ్యత కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.