BPT: జిల్లా శాశ్వత కలెక్టరేట్ నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. బాపట్ల-గుంటూరు రహదారిలో దీనికోసం 15 ఎకరాలు కేటాయించనున్నారు. ముందుగా 10 ఎకరాలు తీసుకోవాలని కలెక్టర్ నిర్ణయించారు. అయితే మంత్రి పార్థసారథి స్థలాన్ని పరిశీలించి, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా 15 ఎకరాలు ఎంపిక చేయాలని సూచించారు. త్వరలో ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపనున్నారు.