VZM: వేతనదారులు కొలతల ప్రకారం పనిచేయాలని జిల్లా జల యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్ శారదాదేవి సూచించారు. సోమవారం బొండపల్లి మండలంలోని ఓంపల్లి గ్రామంలో జరుగుతున్న చెరువు పనులను పరిశీలించారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని ఉదయం 6 నుంచి 10 వరకు, సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీవో అరుణ పాల్గొన్నారు.