KMM: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఉద్యమకారుల ఫోరం కన్వీనర్ రామ్మూర్తి అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల సమస్యలపై ఇవాళ జిల్లా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, పెన్షన్ వంటి హామీలు ఇప్పటివరకు అమలు చేయకపోవడం దారుణమని విమర్శించారు.