GDWL: మానవపాడు మండలం కలుకుంట్ల-అమరవాయి రహదారి పక్కన ఉన్న విద్యుత్ స్తంభం విరిగే స్థితిలో వేలాడుతోంది. గత కొన్ని నెలలుగా ప్రమాదకరంగా ఉన్నా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాలివానల సీజన్ నేపథ్యంలో స్తంభం రోడ్డుపై పడే ప్రమాదం ఉందని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే కొత్త స్తంభం ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.